టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు 'ఆకలి కేక'

Update: 2019-10-25 05:38 GMT

సమస్యల పట్ల అధికారులు స్పందించలేదని నిరసిస్తూ.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిద్రించిన పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు.. ఇసుక కొరత కారణంగా భవననిర్మాణ కార్మికులకు ఆహరం దొరకడం లేదని.. వారి ఆకలి తీర్చాలంటూ ఆకలి కేక పేరుతో పాదయాత్ర చేపట్టారు. పాలకొల్లు నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు భారీ వరదల కారణంగా ఇసుక ఆశించిన స్థాయిలో అందించలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది.

Tags:    

Similar News