ఆ టీడీపీ నేతను వైసీపీలో చేర్చుకుంటాం : ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
ఆ టీడీపీ నేతను వైసీపీలో చేర్చుకుంటాం : ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆ టీడీపీ నేతను వైసీపీలో చేర్చుకుంటాం : ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు మునిసిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఆయన చేరిక గత నెలలోనే పూర్తి కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన చేరికకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. సన్యాసిపాత్రుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు. తొలుత ఆదివారం అమరావతి వెళ్లి పార్టీలో చేరాల్సి ఉండగా, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వాయిదా పడినట్టు ఆయన చెప్పారు. త్వరలో సన్యాసిపాత్రుడును వైసీపీలో చేర్చుకుంటామని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ఈ చేరిక ఉంటుందని స్పష్టం చేశారు.