బీజేపీలోకి టీడీపీ, జనసేన కీలక నేతలు.. ఆదికి రాని ఛాన్స్..

బీజేపీలోకి టీడీపీ, జనసేన కీలక నేతలు.. ఆదికి రాని ఛాన్స్.. బీజేపీలోకి టీడీపీ, జనసేన కీలక నేతలు.. ఆదికి రాని ఛాన్స్..

Update: 2019-10-03 05:19 GMT

ఏపీలో మళ్ళీ వలసల జోరు కొనసాగుతోంది. టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు శనక్కాయల అరుణ, టీడీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, అలాగే మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ మరికొందరు కాంగ్రెస్, జనసేన నేతలు ఈ ఉదయం ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ ను కలిశారు. ఈ సాయంత్రం వారంతా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

మరోవైపు బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. జనసేనకు చెందిన కీలక నాయకుడు చింతల పార్ధసారధి కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలావుంటే దసరా తరువాత కూడా బీజేపీలోకి పెద్దఎత్తున చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో వారిని మాత్రమే చేర్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 

Tags:    

Similar News