Sangam:ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన సిబ్బంది

Update: 2020-03-16 03:32 GMT

 సంగం: రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో, ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ... ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాయిదా నేపధ్యంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని సిబ్బంది జాగ్రత్తగా భద్రపరిచారు. దీంతో సంగం ఎంపిడిఓ కార్యాలయం నిర్మానుష్యంగా తయారైంది. ఈ కార్యాలయంలో ఎన్నికల అధికారుల గదులు సైతం మూతపడ్డాయి. నిన్నటి వరకు సందడిగా ఉన్న కార్యాలయం, ఒక్కసారిగా వెల వెల బోయింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ సైతం వాయిదా పడింది.



Tags:    

Similar News