Sachin Tendulkar: సత్యసాయి పుస్తకం పంపారు.. అది గోల్డెన్ మూమెంట్
Sachin Tendulkar: ప్రజలను జడ్జ్ చేయవద్దని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు.
Sachin Tendulkar: సత్యసాయి పుస్తకం పంపారు.. అది గోల్డెన్ మూమెంట్
Sachin Tendulkar: ప్రజలను జడ్జ్ చేయవద్దని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. దీని వల్ల చాలా సమస్యలు తొలిగిపోతాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకునేవారని తెలిపారు. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటు పడ్డారని అన్నారు.
2011లో వరల్డ్ కప్ సమయంలో సత్యసాయి బాబా తనకు ఫోన్ చేయడంతో పాటు ఒక పుస్తకం పంపారని అన్నారు. అది తనకు సానుకూల దృక్ఫథాన్ని, స్ఫూర్తినిచ్చిందన్నారు. అప్పుడు ట్రోఫి గెలుచుకున్నామని... అది తనకు గోల్డెన్ మూమెంట్ అన్నారు సచిన్ టెండూల్కర్.