TTD: తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ.. రవిచంద్రకు అదనపు బాధ్యతలు

TTD: తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Update: 2026-02-01 10:39 GMT

TTD: తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ.. రవిచంద్రకు అదనపు బాధ్యతలు

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సింఘాల్‌ గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్‌ 4 వరకు టీటీడీ ఈవోగా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసులో కొనసాగిన ఆయనకు గత ఏడాది సెప్టెంబరులో రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించారు.

ఇప్పుడు తాజా ఉత్తర్వులతో ఆయన బదిలీ కాగా, ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ పరిణామంతో టీటీడీ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు అయింది.

Tags:    

Similar News