ఏపీ పాలిటిక్స్.. కమలంతో దోస్తీకి సిద్ధమైన టీడీపీ
AP Politics: ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశంకానున్న చంద్రబాబు
ఏపీ పాలిటిక్స్.. కమలంతో దోస్తీకి సిద్ధమైన టీడీపీ
AP Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. హస్తినలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైనట్లేనంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పటికే బీజేపీకి ఇవ్వాల్సిన స్థానాలపై చంద్రబాబు క్లారిటీకి వచ్చారు. పొత్తు ఖరారు అయితే 5 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు... అరకు, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.