టీడీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

టీడీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు టీడీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Update: 2019-10-10 07:13 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు వచ్చారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండడంతో.. మర్రిపాలెం, ఎన్‌ఏడీల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో.. టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. తమ అధినేత వస్తే కలవకుండా స్వాగతం పలకడానికి వచ్చిన తమను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఫైర్ అయ్యారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అటు.. పోలీసు వలయాన్ని ఛేదించి టీడీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News