విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ సభలో అపశృతి చోటు చేసుకుంది. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లకు విద్యుత్ ప్రవహించడంతో ఇద్దరు పవన్ అభిమానులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు జనరేటర్ ను నిలిపి వేసి విద్యుత్ సప్లై ఆపేశారు. స్పందించిన పోలీసులు భుజాన వేసుకుని అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.