ఎన్నికలు వాయిదా వేయడంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. టీడీపీకి మేలుచేకూర్చేందుకే

Update: 2020-03-15 16:14 GMT
Mp vijaya sai reddy (File Photo)

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుపట్టారు. టీడీపీకి మేలుచేకూర్చేందుకే ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌పై తమకు గౌరవం ఉందని, చంద్రబాబుతో కలిసి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైనదో లేదో ప్రజలే తేలుస్తారని అన్నారు. కరోనా వైరస్‌ కంటే నిమ్మగడ్డ రమేష్‌ ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను బ్రస్టు పట్టించారని విమర్శించారు. ఎన్నికల వాయిదాపై సుప్రీను ఆశ్రయిస్తామని చెప్పారు.

Tags:    

Similar News