బాలికకు నీలి చిత్రాలు చూపించాడు.. చివరకు..

బాలికకు నీలి చిత్రాలు చూపించాడు.. చివరకు.. బాలికకు నీలి చిత్రాలు చూపించాడు.. చివరకు..

Update: 2019-09-29 04:27 GMT

పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపాడో ప్రబుద్ధుడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో జరిగింది. స్థానికంగా నివాసముండే పసుపులేటి దుర్గాప్రసాద్‌ వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడం, స్థానికంగా డబ్బులు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు. ఇతనికి 16 ఏళ్ల క్రితం వివాహమైనా సంతానం కలగలేదు. భార్యను మానసికంగా, లైంగికంగా వేధించేవాడు. దాంతో వేధింపుల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం అలవాటు. అంతటితో ఆగకుండా స్థానికంగా నివాసముండే బాలికలకు నీలి చిత్రాలు చూపించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన బాలిక పట్ల వికృతంగా ప్రవర్తించాడు. శనివారం ఇంటివద్ద ఉన్న పదేళ్ల బాలికకు నీలిచిత్రాలు చూపించాడు. దాంతో ఆ బాలిక భయపడి ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. దాంతో స్థానికులతో కలిసి అతనికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News