Botsa Satyanarayana: మంత్రి బొత్స వద్దకు చేరిన ఎస్‌.కోట పంచాయితీ

Botsa Satyanarayana: ఏదో ఆశించి తనపై ఫిర్యాదు చేస్తున్నారన్న కడుబండి

Update: 2024-01-08 07:34 GMT

Botsa Satyanarayana: మంత్రి బొత్స వద్దకు చేరిన ఎస్‌.కోట పంచాయితీ

Botcha Satyanarayana: ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో అసమ్మతి సెగ పంచాయితీ మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు చేరింది. దీంతో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఒకరిపై ఒకరు బొత్సను కలిసి ఫిర్యాదులు చేసుకున్నారు. తనపై అసమ్మతి నేతల తిరుగుబాటుపై ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పందించారు. తన మీద ఫిర్యాదు చేసేవారు ఏదో ఆశించి చేస్తున్నారని... ఎమ్మెల్సీ అయినా మరే నాయకుడు అయినా.. వారు ఏదో ఆశించి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ కేటాయిస్తారని తెలిసి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాననికడుబండి వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News