మతం పేరుతో చంద్రబాబు,పవన్ల నీచ ప్రచారం- వెల్లంపల్లి
అన్యమత ప్రచారం అంటూ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
అన్యమత ప్రచారం అంటూ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రి అనే చంద్రబాబు నాయుడు, పవర్ పుల్ అనే పవన్ కళ్యాణ్ లు మతాన్ని అడ్డుపెట్టుకునే నీచ ప్రచారానికి ఒడికడుతున్నారని ఆయన అన్నారు. ఎక్కడా అన్యమత ప్రచారం జరగలేదని.. పైగా చంద్రబాబు హయాంలోనే ఆర్టిసి టిక్కెట్ లపై అన్యమత ప్రచారం చేశారని ఆయన అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కులం, మతం, పార్టీ,ప్రాంతం తేడా లేకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారని ఆయన అన్నారు.