ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి

Update: 2019-10-11 08:23 GMT

ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ప్రేమికుడు మృతిచెందాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం నిలేశ్వర పాలెంలో జరిగింది. స్థానిక ప్రాంతానికి చెందిన హనుమనాయక్ (26), టీటీసీ చదివే అప్సానా కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఇదివరకే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

దాంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్సానాపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే హఠాత్తుగా వీరిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. ఈ ఘటనలో హనుమనాయక్ మృతి చెందగా.. అప్సానా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా వీరి ఆత్మహత్యకు పెద్దలే కారణమా లేక ఇంకేమైనా కారణాలున్నాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News