రాజకీయలబ్ధి కోసం లాంగ్‌మార్చ్‌ చేయడం లేదు: నాదెండ్ల

Update: 2019-11-02 14:10 GMT
nadendla manohar

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేసేందుకే లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు జనసేన నేత నాదేండ్ల మనోహర్ తెలిపారు. లాంగ్ మార్చ్ కు అనుమతులు లేవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదన్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుండి ఉమెన్స్ కాలేజీ వరకు లాంగ్ మార్చ్ జరుగుతుందన్నారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుందని నాదేండ్ల మనహోర్ చెప్పారు. ప్రభుత్వ ఇసుక పాలసీల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు జనసేన నేత లక్ష్మీనారాయణ.  

Tags:    

Similar News