పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటు : మంత్రి పుష్ప శ్రీవాణి
చంద్రబాబు, పవన్ పిల్లలు, మనువలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా
ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, పవన్ పిల్లలు, మనువలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం లేదా అని మంత్రి పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు. ఇంగ్లీషు సంప్రదాయాలను పాటించే పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం బూసరాజపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో మనబడి నాడు -నేడు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.