కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
ఒంగోలులోని ప్రముఖ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న లహరి అనే విద్యార్థిని బిల్డింగ్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన కళాశాల సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థినిని పక్కనే ఉన్న సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని కోలుకుంటుందని కళాశాల ఛాన్సలర్ కేసీ రెడ్డి వెల్లడించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో ఒత్తిడికి గురై మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.