అరకులోయ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సూచించారు. అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిని
ఆయన సందర్శించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మందుల నిల్వల వివరాలను అడిగితెలుసుకున్నారు.