శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం సరికొత్త రికార్డును అధిగమించింది. 2019-20 వ వార్షిక సంవత్సరంలో 850 మిలియన్ యూనిట్ల టార్గెట్ను అధిగమించి రికార్డు స్థాయిలో ఈసారి ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ రెండు వందల పదమూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి గురువారం ఉదయం 7 గంటలకు అధిగమించినట్టు అధికారులు తెలిపారు. ఈ విద్యుత్తు ఉత్పత్తి చేసినందుకు 150 టీఎంసీల నీటిని వినియోగించినట్లు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు వివరించారు.