VIT AP University: ఘనంగా వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

* ముఖ్యఅతిథిగా నోబెల్‌ అవార్డు గ్రహీత ఎం.స్టానెలీ విట్టింగ్హాం * మైక్రోసాఫ్ట్‌ ఇండియా మయురిక సింగ్‌ హాజరు

Update: 2021-09-24 11:00 GMT
వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలు (ఫోటో- ది హన్స్ ఇండియా)

VIT AP University: వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం వర్చువల్‌ విధానంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నోబెల్‌ అవార్డు గ్రహీత ఎం.స్టానెలీ విట్టింగ్హాం, మైక్రోసాఫ్ట్‌ ఇండియా మయురిక సింగ్‌ హాజరయ్యారు. వీఐటీ ఫౌండర్‌ అండ్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎం.స్టానెలీ విట్టింగ్హాం ప్రపంచమంతా ప్రయాణించి కొత్త విషయాలను తెలుసుకోవాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కలలను సాకారం చేసుకునే విధంగా ప్రతీఒక్కరూ ప్రయత్నించాలని చెప్పారు.

Tags:    

Similar News