వేగంగా సిద్ధమవుతున్న గ్రామ సచివాలయం పైలెట్ ప్రాజెక్ట్
అక్టోబర్ 2 న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్ గా పులివెందుల నియోజకవర్గం లోని లింగాలలో గ్రామ సచివాలయ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు.
పులివెందుల: లింగాలలో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని హైలెట్ ప్రాజెక్ట్గా మండల కేంద్రంలో గ్రామ సచివాలయం ప్రారంభించాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో సురేంద్రనాథ్ ఆధ్వర్యంలో లింగాల పంచాయతీ కార్యాలయంలో ఫర్నిచర్ బీరువాలు తాగునీరు విద్యుత్ కంప్యూటర్స్ అంతర్జాల కనెక్షన్లను సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పదిమంది కూలీలతో ఆవరణలో మట్టి వేసి చదును చేసే పనులను వేగవంతం చేస్తున్నారు