Eluru: జిల్లాలో ఐదు వేల క్వారంటైన్ బెడ్లు ఏర్పాటుకు 11 కళాశాలల గుర్తింపు

జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా 5 వేల క్వారంటైన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు 11 కళాశాలలను గుర్తించినట్లు మంత్రులు, అధికారులు తెలిపారు.

Update: 2020-03-31 02:39 GMT

పశ్చిమగోదావరి: జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా 5 వేల క్వారంటైన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు 11 కళాశాలలను గుర్తించినట్లు మంత్రులు, అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏలూరులోని జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ రంగనాధరాజు, స్త్రీ శిశు శాఖా మంత్రి తానేటి వనిత, కలెక్టర్ ముత్యాలరాజు సమావేశమయ్యారు.  

Tags:    

Similar News