ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మృతి.. స్పీకర్, మంత్రి సంతాపం

ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మృతి.. స్పీకర్, మంత్రి సంతాపం

Update: 2019-10-16 01:32 GMT

మాజీ ఎంఎల్‌సి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మజ్జీ శారదా (58) గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ కొండపూర్‌లోని ఆమె నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లాలోని మండస ఆమె స్వస్థలం. ఆమె మాజీ పీసీసీ అధ్యక్షుడు మజ్జీ తులసి దాస్ పెద్ద కుమార్తె. 2007 లో MLC గా ఎన్నికయ్యారు మరియు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఆమెకు అన్ని పార్టీల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ పార్టీ నాయకుడిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలకు చేయలేదు. ఆమె మరణం గురించి తెలుసుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమినేని సీతారాం, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు, తదితరులులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.. శ్రీకాకుళం జిల్లా ఒక సీనియర్ నాయకురాలిని కోల్పోయిందని వారు వ్యాఖ్యానించారు.  

Tags:    

Similar News