మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత
టీడీపీ సీనినియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు.
టీడీపీ సీనినియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ న్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు అయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం తీవ్ర గుండె పోటుకు గురైన ఆయన్ను... కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం. మరోవైపు కోడెల గుండెపోటుతోనే ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాలపై వివరాలు ఇంకా అందాల్సి ఉంది.