ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంపై జీవో జారీ

Update: 2019-11-20 10:24 GMT

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్‌తో పాటు ప్రైవేట్‌ స్కూల్స్‌కి ఈ జీవో వర్తిస్తుంది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇంగ్లీష్‌లో బోధించేందుకు ఉపాధ్యాయులకు గైడెన్స్‌ ఇవ్వాలని, నూతన సిలబస్‌ను సిద్ధం చేయాలని NCERT ని ఆదేశించింది ప్రభుత్వం. దీంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

Full View


Tags:    

Similar News