టీటీడీ ఆగమ సలహాదారుగా రమణదీక్షితులు ?
-టీటీడీ ఆగమ సలహాదారుగా రమణదీక్షితులు -సీఎం జగన్ ఆదేశాలతో నియామకానికి రంగంసిద్ధం -ఏడాదిన్నర తర్వాత టీటీడీలోకి రీఎంట్రీ ఇవ్వనున్న రమణదీక్షితులు -త్వరలోనే అధికారిక ఉత్తర్వులు -రమణదీక్షితులపై పరువు నష్టం దావా ఉపసంహరణ
టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు లైన్క్లియరైంది. సీఎం జగన్ ఆదేశాలతో టీటీడీ ఆగమ సలహాదారుగా నియమించేందుకు రంగంసిద్ధమైంది. రమణదీక్షితులపై గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా ఉపసంహరించుకోవడంతో కోర్టు క్లియరెన్స్ తర్వాత అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దాంతో ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రమణదీక్షితులు టీటీడీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.