తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ఆపరేషన్ రాయల్ వశిష్ట చేపట్టిన ధర్మాడి టీమ్ అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించడంతో ఐదో రోజు కూడా పాత పద్ధతిని ఫాలో అవుతోంది. బోటును బయటకు లాగేందుకు శ్రమిస్తోన్న ధర్మాడి బృందం లంగర్ వేసే డీప్ వాటర్ డ్రైవర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బోటులో గల్లంతైన వారిలో కొంత మంది మృతదేహాలు ఉండటంతో ముందుకు వచ్చేందుకు నిరాకరించడంతో వారిని ఒప్పించి రంగంలోకి దింపేందుకు విశాఖకు వెళ్లింది ధర్మాడి బృందం.