చిత్తూర్ జిల్లాలో పొక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది నవంబర్ 7న చిన్నారి హర్షితపై హత్యాచారం కేసు లో మొహ్మద్ రఫీకి మొదటి అదనపు కోర్ట్ దోషిగా నిర్దారించి అతడికి మరణ శిక్ష విధించింది. అతనిని ఎప్పుడు ఉరి తీయాలన్నది హై కోర్ట్ నిర్ణయిస్తుంది అని న్యాయమూర్తి తెలిపారు. ఏపీలో పొక్సో చట్టం కింద ఉరిశిక్ష పడ్డ తొలి కేసు కావడం విశేషం.