విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుటే దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి చీటీల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసి పారిపోయాడు. దాంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాసరెడ్డి ఆచూకీ చెప్పాలని అతని స్నేహితుడైన మురళిని పోలీసులు స్టేషన్కు పిలిపించారు పోలీసులు. ఈ నేపథ్యంలో తనకు ఏ సమాచారం తెలియదని చెప్తున్నా నాలుగు రోజులుగా తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు పోలీసులు.
భార్య కూడా మురళిని విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులకు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదనకు గురయ్యారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన మురళి దంపతులు శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్పందించిన పోలీసులు దంపతులను చికిత్స కోసం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు చేరి ఆరా తీస్తున్నారు.