లాక్ డౌన్ పాటించని ఆకతాయిలు.. పోలీసుల వినూత్న ప్రయోగం: ట్రాన్స్జెండర్స్తో.
కరోనా లాక్ డౌన్ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఆకతాయిలి పెడచెవిన పెడుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో కర్నూలు నగర మూడవ పట్టణ పోలీసులు కొత్తగా ఆలోచించి హిజ్రాల సహాయం తీసుకున్నారు. వారి సహాయంతో ప్రభుత్వం ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత కూడా రోడ్ల మీద తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల ద్వారా వచ్చే వారికి కరోనా పై తమదైన శైలిలో అవగాహన పెంచుతూ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ట్రాన్స్జెండర్స్.