Palakonda: మాస్క్ ధరించకపోతే ఫైన్ కట్టాల్సిందే: కమీషనర్ లిల్లీ పుష్పనాధం

నగర పంచాయతీలో ఈ రోజు మాస్కులు క్యాంపు కమీషనర్ లిల్లీ పుష్ప నాదం నిర్వహించారు.

Update: 2020-04-19 16:48 GMT

పాలకొండ: నగర పంచాయతీలో ఈ రోజు మాస్కులు క్యాంపు కమీషనర్ లిల్లీ పుష్ప నాదం నిర్వహించారు. చికెన్, మటన్ షాపులతో పాటు కూరగాయలు, కిరాణా మార్కెట్ లను సందర్శించి చాలామంది మాస్కులు ధరించడం చూసి కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లేనివారికి మాస్కులు ఇప్పించారు.

మాస్కులు లేకుండా మార్కెట్లోకి వచ్చిన బయటకు వచ్చిన వారికి 200 రూపాయల అపరాధ రుసుం విధిస్తామని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇటువంటి చర్యలు చేపట్టడం అనివార్యం అన్నారు. నగర పంచాయతీలో గ్రీన్ పాలకొండలో భాగంగా అన్ని వీధుల్లో రోడ్లకు ఇరువైపులా బ్లీచింగ్ పౌడరు జల్లించారు. వాలంటీర్లు పాల్గొన్నారు. వైట్ హౌస్ జంక్షన్, ఘటాలు దెప్పి వీధి, జల్లువీది ప్రాంతాలలో పర్యటించారు.



Tags:    

Similar News