CM Jagan: జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో.. దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు

CM Jagan: చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది

Update: 2024-01-11 10:11 GMT

CM Jagan: జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో.. దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు

CM Jagan: ఏపీలో 8వ విడతలో జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని సీఎం జగన్‌ అన్నారు. . రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417కోట్ల94 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు అందించామన్నారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారని ఆయన అన్నారు .చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు.. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని సీఎం జగన్‌ తెలిపారు.

Tags:    

Similar News