వైసీపీ నేత కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌

వైసీపీ నేత కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌ వైసీపీ నేత కుమార్తె వివాహానికి సీఎం వైఎస్‌ జగన్‌

Update: 2019-10-09 02:03 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లనున్నారు. రాజమండ్రి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె విహహ వేడుకకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. కాగా గురువారం(10వ తేదీన) ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా 'వైఎస్సార్‌ కంటి వెలుగు'ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Tags:    

Similar News