కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల బాహాబాహీ

కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల బాహాబాహీ కడప జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల బాహాబాహీ

Update: 2019-09-29 04:50 GMT

కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారి పల్లిలో వైసీపీ, టీడీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి.. తీవ్ర వివాదానికి దారితీసింది. దాంతో ఇరు పార్టీల నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పెప్పర్‌ స్పే, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయ.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే మళ్ళీ ఏమైనా గొడవలు జరుగుతాయేమోనని శనివారం రాత్రి పోలీసులు కాపలాగా ఉన్నారు. విషయం పొలిసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అక్కడ పరిస్థితిపై దృష్టిసారించారు. 

Tags:    

Similar News