సీఎం జగన్‌తో నేడు చిరంజీవి భేటీ.. ఎవరెవరంటే..

సీఎం జగన్‌తో నేడు చిరంజీవి భేటీ.. ఎవరెవరంటే.. సీఎం జగన్‌తో నేడు చిరంజీవి భేటీ.. ఎవరెవరంటే..

Update: 2019-10-14 00:54 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి నేడు సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిరంజీవి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుస్తారని అధికారులు వెల్లడించారు. చిరు తోపాటు ఆయన కుమారుడు రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సీఎం ఇంట్లోనే విందు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ అగ్రనేతలు వెల్లడిస్తున్నారు. కేవలం సైరా సినిమా చూడమని కోరేందుకే చిరు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసి సినిమాకు ఆహ్వానించిన చిరంజీవి.. ఆమె కోసం ప్రత్యేకంగా షో వేయించారు. అలాగే ఇప్పుడు ఏపీ సీఎం కూడా వస్తారంటున్నారు.

ఇదిలావుంటే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వచ్చి అభినందనలు తెలపలేదని.. అదే చంద్రబాబు అయితే వచ్చి వాటేసుకునేవారని వైసీపీ నేత, నటుడు పృథ్వీ రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సీఎంను కలిసేందుకు సురేష్ బాబు, అశ్వినిదత్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు అపాయింట్మెంట్ కోరినా కుదరలేదని సమాచారం. త్వరలో మరికొంత మందికి కూడా సీఎంను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News