పవన్ కళ్యాణ్ కు టాటా చెప్పిన మరో కీలకనేత

పవన్ కళ్యాణ్ కు టాటా చెప్పిన మరో కీలకనేత పవన్ కళ్యాణ్ కు టాటా చెప్పిన మరో కీలకనేత

Update: 2019-10-02 16:05 GMT

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేనకు.. ఎన్నికల అనంతరం షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ పార్టీకి చాలా మంది కీలక నేతలు రాజీనామా చేయగా.. తాజాగా మరో నేత పవన్‌ కళ్యాణ్‌ కు టాటా చెప్పేశారు. జనసేన సీనియర్‌ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్‌ చైర్మన్ చింతల పార్థసారథి బుధవారం తన పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కేవలం 6.67 శాతం ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీకి చింతల గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పవన్‌ కళ్యాణ్‌కు మెయిల్ లో పంపించారు. త్వరలో ఆయన వైసీపీ లేదా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News