కందుకూరు: పురపాలక సంఘ పరిధిలోని వార్డులను, సచివాలయాలను రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఎస్ ధర్మారావు, జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ లుపై తీసుకున్న చర్యలను పరిశీలించారు. ప్రతి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో మాట్లాడి వారి పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.