చంద్రబాబు విజన్ 2020 పూర్తయిపోయింది: సజ్జల

* ఇప్పుడు విజన్ 2050 అని మార్చుకున్నారు:సజ్జల * ఓటుకు నోటులో గొంతు బాబుదే అని అందరికీ తెలుసు * జగన్ పథకాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం ఇది : సజ్జల

Update: 2021-01-01 12:28 GMT

విజన్ 2020 పేరుతో ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఓడిపోయాక ఇప్పుడా విజన్ ను ట్వంటీ ఫిఫ్టీ గా (2050)గా మార్చుకున్నారని ఏపి ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జలరామకృష్ణా రెడ్డి విమర్శించారు. కెమెరా ముందు కనపడి పనికి రాని మాటలు మాట్లడటమే చంద్రబాబు విజన్ అని ఎద్దేవా చేశారు. జగన్ పథకాలు చక్కగా అమలు చేస్తుంటే ఓర్వలేక దృష్టి మరల్చడానికి అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఓటుకు నోటు కేసులో మత్తయ్య జరిగింది అంతా చెప్పేశారని ఓటుకు నోటు కేసులో ఫోన్ సంభాషణ చంద్రబాబుదే అని ప్రపంచమంతా తెలుసనీ సజ్జల అన్నారు.

Tags:    

Similar News