Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
Tirumala: భీమా సినిమా హిరో గోపిచంద్, దర్శకుడు హర్ష
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్ర యూనిట్ వేర్వేరుగా దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భీమా సినిమా విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు హిరో గోపిచంద్ తెలిపారు.