Kurnool: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకోండి: బైరెడ్డి
కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లాడుతున్న ప్రజలపై దృష్టి పెట్టాలే కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడం దారుణమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
కర్నూలు: కరోనా వైరస్ తో దేశం మొత్తం అల్లాడుతున్న ప్రజలపై దృష్టి పెట్టాలే కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడం దారుణమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్ నే వాయిదా వేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థ ఎన్నికలు ఎలాగ పెడతారు అని ప్రశ్నించారు.
కరోనా వైరస్ ఉండగా ఎన్నికలకు పోకుండా మానుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా ఎన్నికలపై దృష్టి సాధిస్తే ప్రజలు కరోన బారిన పడే అవకాశం ఉందన్నారు.