Kurnool: సీఎం జగన్ ను కలిసిన టీజీ వెంకటేష్
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కర్నూలుకు వచ్చిన సీఎం జగన్ ను... బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో గురువారం కలిశారు.
కర్నూలు: పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కర్నూలుకు వచ్చిన సీఎం జగన్ ను... బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో గురువారం కలిశారు. సీఎం జగన్ - టీజీ వెంకటేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
మాకు రావలసిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందంటూ సీఎం జగన్ తో టిజివీ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరామని... నివేదిక కూడా పంపించామని జగన్ తెలిపారు. హైకోర్టు ప్రకటనపై సీఎం జగన్ కు టీజీ కృతజ్ఞతలు తెలిపారు