అద్దంకి వైసీపీ ఇన్ ఛార్జ్ ని తప్పించిన బాలినేని
అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా బాచిన కృష్ణ చైతన్య
వైసీపీ అధిష్టానం.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తోట వాణిని కాదని.. ఎన్నికల అనంతరం గతంలో ఇన్ ఛార్జ్ గా పనిచేసిన దవులూరి దొరబాబును పెద్దాపురం ఇంచార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అద్దంకి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ని తప్పించారు మంత్రి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి.. ముఖ్యమంత్రి ఆదేశాలకు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా బాచిన కృష్ణ చైతన్యను ఎంపిక చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాచిన చెంచు గరటయ్య తరుపున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గరటయ్యను తప్పించి ఆయన కుమారుడిని నియమించారు. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అద్దంకి ఇన్ ఛార్జ్ ని ప్రకటించారు.