వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో పలు సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది. రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులున్నా.. టాక్స్ కట్టేవారు ఉన్నా ఈ పథకానికి అర్హులని ప్రకటించింది. అర్హులైన రైతులు మరణిస్తే.. చట్ట ప్రకారం కుటుంబంలోని వారికి ఈ పథకం వర్తిస్తుంది.