శాసనమండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం

Update: 2020-01-22 15:52 GMT

శాసనమండలి ఛైర్మన్ సంచన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వికేంద్రికరణ, సీఆర్డీఏ బిల్లులకు సెలెక్ట్ కమిటీకి పంపించారు. అనంతరం సభను వాయిదా నిరవధిక వాయిదా వేస్తు నిర్ణయం తీసుకున్నారు. మండలి వాయిదా అనంతరం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల అభివృద్ధి వైసీపీ లక్ష్యమని, కానీ చట్ట సభలు అంటే టీడీపీ గౌరవం లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే కంటే చాలా బాధకరమైన రోజని అభివర్ణించారు. రూల్ 71 ఏ రాష్ట్రంలో లేదని, చంద్రబాబు గ్యాలరీలో కూర్చోని ఛైర్మన్ ను ప్రభావితం చేశారని ఆరోపించారు. శాసన మండలిలో యనమల రామకృష్ణుడు నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించారని బుగ్గన మండిపడ్డారు. 

 

Tags:    

Similar News