ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు కోసం ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.

Update: 2019-08-12 14:59 GMT

ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు కోసం ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఆగస్టు 14, 15 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికేట్ వెరిఫికేషన్) కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఆగస్టు 16 నుంచి 18 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు ఆగస్టు 19 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీరికి ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. ఈడబ్ల్యూసీ కోటా కింద కూడా సీట్లను కేటాయించనున్నారు.

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇదీ..

ఆగస్టు 14 , 15 తేదీల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్

ఆగస్టు 16 - 18 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్

ఆగస్టు 19 - 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు

ఆగస్టు 23న సీట్ల కేటాయింపు

ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన..

ఆగస్టు 16న 1-8,000 ర్యాంకుల వరకు

ఆగస్టు 17న 8,001-19,000 ర్యాంకు వరకు

ఆగస్టు 18న 19,001-31,000 ర్యాంకు వరకు

ఆగస్టు 19న 31,001 నుంచి చివరి ర్యాంకు వరకు

Tags:    

Similar News