హైకోర్టు తీర్పు పై సుప్రీంకు ఏపి ప్రభుత్వం

Update: 2020-03-18 07:37 GMT

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారణ జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు ఉన్న రంగుల స్థానంలో వేరే రంగులు వేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.



Tags:    

Similar News