ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Update: 2021-01-19 16:07 GMT

నారాయణస్వామి ఫైల్ ఫోటో 

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 10-15 సంవత్సరాల్లో దేశానికి సీఎం జగన్ ఏమౌతారో మీరే చూడండంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో అభిమాన సంఘాలు పెట్టి ఆరాధాస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకునేందుకు మరో మంత్రి ధర్మాన క్రిష్ణదాస్‌తో కలిసి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను ఆపలేరన్నారు. ప్రివిలేజెస్ కమిటీ ముందు రోజా ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదని అది ఆమె మనస్సాక్షికి సంబంధించిన విషయమన్నారు. 

Tags:    

Similar News