ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం తన సొంత ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. 'గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి' అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ నేడు 69వ పుట్టిన రోజు సందర్బంగా దేశ వ్యాప్తంగా మోదీకి శుభాకాంక్షలు అందుతున్నాయి. మరోవైపు మోదీ.. గుజరాత్లోని గాంధీనగర్లో తన తల్లి హీరాబెన్ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు.