Jagan: మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం
Jagan: మ.3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్
Jagan: ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ భేటీలో మేనిఫెస్టోపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంశం మేనిఫెస్టోలో చేర్చే ఆలోచనలో ఉంది జగన్ సర్కార్. మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాల అమలుపై చర్చ జరిగేఅవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నారు సీఎం జగన్.