రాష్ట్రంలో వైసీసీ ఆరాచక పాలన కొనసాగిస్తోంది : కన్నా
ప్రాంతీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేస్తాయి : కన్నా
జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరాచక పాలన కొనసాగిస్తోందని కన్నాల లక్ష్మీనారాయణ విమర్శించారు. 9నెలల్లో ప్రజలను పీల్చుకు తినడం తప్ప చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేస్తాయని చెప్పారు. రాజధాని రైతుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.